యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం | Mulayam to hold 18 rallies across Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం

Oct 10 2013 10:42 AM | Updated on Aug 17 2018 7:32 PM

యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం - Sakshi

యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం

2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార సమాజవాది పార్టీ ప్రచార పర్వానికి తెరతీసింది.

2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార సమాజవాది పార్టీ ప్రచార పర్వానికి తెరతీసింది. అందులోభాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా18 ర్యాలీల(బహిరంగ సభ)ల్లో పాల్గొనున్నారు. అందుకోసం ఈ నెల 29న అజాంఘర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ములాయం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

రాష్ట్రంలోని రైతుల, పేద ప్రజలు, కార్మికుల కోసం అఖిలేష్ సింగ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ర్యాలీలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ అంతా ఇప్పటికే పూర్తి అయిందని తెలిపారు. అలాగే వివిధ దేశాల్లోని యూపీకి చెందిన ఎన్నారైల ఓట్లు కూడా సమాజవాది పార్టీకే పడేలా చేపట్టవలసిన చర్యలపై ఓ కొర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ములాయం పార్టీ వర్గాలకు సూచించారని చెప్పారు. అయితే దేశంలో అత్యధిక లోక్సభ సీట్లు గల రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి.



ఆ రాష్ట్రంలో ఓట్ల కొల్లగొట్టే పనిలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు ఊహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నెల 29న కాన్పూర్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ర్యాలీ నిర్వహించి బీజేపీ ప్రచార కార్యక్రమానికి తెరలేపనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ 8 ర్యాలీలు నిర్వహించనుంది. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అలీఘర్, రామ్పూర్లలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement