కోలారు (కర్ణాటక)/హైదరాబాద్/కల్వకుర్తి న్యూస్లైన్: కోలారులో ఓ వైద్యవిద్యార్థిపై ఇద్దరు చైన్ స్నాచర్లు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. మెడలోని గొలుసు లాగడానికి ఆ దుండగులు ప్రయత్నించగా ఆ మెడికో ప్రతిఘటించడంతో పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించారు. ఈ దారుణం కోలారు సమీపంలోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల వద్ద మంగళవారం రాత్రి జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ (22) మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నాడు. రాత్రి 10.30 సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. కామేశ్వర్ ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి, దగ్గరలోని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. తర్వాత కామేశ్వర్ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 70 శాతం గాయాలతో అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. తండ్రి వెల్లంకి లక్ష్మణ శర్మ, తల్లి జ్యోతి, సోదరి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
తల్లి జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డకు శత్రువులు లేరని, ఎవరిపైనా అనుమానం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని అతని సహచర విద్యార్థులు కూడా తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాధితుడి తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా, జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ మారేడ్పల్లిలో నివాసం ఉంటున్నారు. కామేశ్వర్పై దాడితో మారేడ్పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయాలపై కామేశ్వర్కు ఆసక్తి లేదని, ఈ సంఘటనను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని కామేశ్వర్ దగ్గర బంధువు చెప్పారు. దాడిని ఖండిస్తూ టీజేఏసీ, టీజీవీపీలు కల్వకుర్తిలో ర్యాలీ నిర్వహించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కోలారు జిల్లా ఎస్పీ తెలిపారు.
మెడికోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చైన్ స్నాచర్లు
Published Thu, Nov 14 2013 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement