మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ | Mahatma Gandhi's scion faces trial in South Africa | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ

Oct 20 2015 5:28 PM | Updated on Sep 3 2017 11:15 AM

మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ

మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ

ఇద్దరు వ్యాపారవేత్తలను మోసగించిన కేసులో మహాత్మాగాంధీ మునిమనవరాలు దక్షిణాఫ్రికాలో విచారణ ఎదుర్కొంటున్నారు.

జోహన్నెస్బర్గ్: ఇద్దరు వ్యాపారవేత్తలను మోసగించిన కేసులో మహాత్మాగాంధీ మునిమనవరాలు దక్షిణాఫ్రికాలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్ లతారాంగోబిన్ (45) సోమవారం డర్బన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. తను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆమె న్యాయమూర్తికి విన్నవించారు. అనంతరం 3,776 డాలర్ల పూచీకత్తుపై బెయిలుపై విడుదలయ్యారని ఈ న్యూస్ చానెల్ పోలీసులను ఉటంకిస్తూ పేర్కొంది.

డర్బన్కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 8.30 లక్షల డాలర్లు తీసుకొని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోబిన్‌ను ఈ నెల 15న అరెస్టు చేశారు. తనకు ఓ కాంట్రాక్టు దక్కిందని చెబుతూ.. ఇందుకు కొంత డబ్బు అవసరమని, వారిని నమ్మించి డబ్బు తీసుకుందని పోలీసులు అభియోగాలు మోపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement