రెండు మందుపాతర్లు వెలికి తీసిన ఒడిశా పోలీసులు | Land mines unearthed from Koraput-Laxmipur road in Odisha | Sakshi
Sakshi News home page

రెండు మందుపాతర్లు వెలికి తీసిన ఒడిశా పోలీసులు

Oct 23 2013 2:03 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఒడిశాలోని కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిలో రెండు శక్తిమంతమైన మందుపాతరలను కనుగొని, వెలికి తీసినట్లు కోరాపూట్ జిల్లా ఎస్పీ అశ్విని కుమార్ బుదవారం ఇక్కడ వెల్లడించారు

ఒడిశాలోని కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిలో రెండు శక్తిమంతమైన మందుపాతరలను కనుగొని, వెలికి తీసినట్లు కోరాపూట్ జిల్లా ఎస్పీ అశ్విని కుమార్ బుదవారం ఇక్కడ వెల్లడించారు. మావోయిస్టులే ఆ మందుపాతరలను ఉంచినట్లు భావిస్తున్నామన్నారు. స్థానికంగా మావోయిస్టులను కట్టడి చేసేందుకు భద్రత దళాలు, పోలీసులు ఈ ప్రాంతంలో చురుగ్గా వ్యవహారిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిని వెడల్పు చేసేందుకు కార్మికులు పనులు చేపట్టారని, అందులోభాగంగా ఆ ముందుపాతరలను కనుగొన్నట్లు తెలిపారు. అయితే రెండు బకెట్లలో వాటిని ఉంచినట్లు చెప్పారు. వాటికి కరెంట్ వైర్లను అనుసంధానించలేదని, అవి అమర్చి కూడా చాలా రోజులు అయి ఉండవచ్చని చెప్పారు.

 

ఈ ఏడాది ఆగస్టు 27న కోరాపూట్ జిల్లాలోని 26వ జాతీయ రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు సరిహద్దు భద్రత సిబ్బంది మరణించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిపై మరన్ని మందుపాతరలు ఉండి అవకాశాలు ఉన్నాయని ఎస్పీ అశ్విని కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement