రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ | krishna kirthan quizzing 2nd day by ACB | Sakshi
Sakshi News home page

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ

Jul 16 2015 5:44 PM | Updated on Aug 17 2018 12:56 PM

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ - Sakshi

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు. గురువారం ఆయన ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఏసీబీ అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30  కృష్ణను సుదీర్ఘంగా విచారించారు. కృష్ణకీర్తన్తో పాటు సెబాస్టియన్, ఉదయ సింహాలను కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

బుధవారం కూడా ఏసీబీ అధికారులు కృష్ణను విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలను ఏసీబీ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement