కేరన్ సెక్టర్లో నలుగురు తీవ్రవాదులు హతం | Infiltration bid foiled in Keran sector, 4 militants killed | Sakshi
Sakshi News home page

కేరన్ సెక్టర్లో నలుగురు తీవ్రవాదులు హతం

Oct 5 2013 10:03 AM | Updated on Sep 1 2017 11:22 PM

జమ్మూ కాశ్మీర్లో కెరన్ సెక్టర్లో భారత్లోకి చోరబడేందుకు యత్నించిన నలుగురు తీవ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్లో కెరన్ సెక్టర్లో భారత్లోకి చోరబడేందుకు యత్నించిన నలుగురు తీవ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. ఆ ఘటన స్థలంలో ఆరు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

నిన్న దేశంలో చోరబాటుకు యత్నించిన ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. దాంతో భారత్, పాక్ సరిహద్దుల్లోని గస్తీని పెంచినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే గత 12 రోజులుగా  దేశంలో తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement