మోడీ ప్రధానైతే భారత్లో ఉండను: అనంతమూర్తి
సాక్షి, బెంగళూరు: గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే తాను భారత్లో ఉండబోనని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యు.ఆర్.అనంతమూర్తి అన్నారు. బెంగళూరులోని బసవనగుడిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూ వంటి ఎందరో నేతలు భారత్ లౌకికవాద దేశంగా ఉండాలని కలలుగన్నారని పేర్కొన్నారు. అయితే మోడీ వంటి నాయకుడు ప్రధాని అయితే ఆ కలలకు అర్థం లేదన్నారు. మోడీ పాలనలో గుజరాత్ ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఆయన ప్రధాని అయితే దేశంలోని ప్రజలందరికీ అదే గతి పడుతుందన్నారు. అందువల్లే మోడీ ప్రధాని అయితే తాను భారత్ను వదిలి వెళ్లడం ఖాయమని అనంతమూర్తి స్పష్టం చేశారు.