* ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు నిషేధం
* పుష్కరాల్లో ఖాకీల అప్రమత్తత
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు ఛత్తీస్గఢ్ను కలుపుతూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిషేధించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వారం క్రితం ప్రకటించారు.
నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అధికారికంగా ప్రారంభం కాకపోయినా... ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మీదుగా ఛత్తీస్గఢ్కు వెళ్లేవారు ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వెంకటాపురం మీదుగా ఆ జిల్లా నుంచి, సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. పుష్కరాల రెండోరోజు బుధవారం ఈ రాకపోకలు కాస్త పెరిగాయి.
గోదావరి తీరం అవతలివైపు(పూసూరు) ఉన్నవారు బ్రిడ్జిమీదుగా ముల్లకట్ట వైపునకు వచ్చి గోదావరిలో పుష్కరస్నానం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అకస్మాత్తుగా గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు. గోదావరి అవతలి వైపు నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా పోలీసు ఔట్పోస్టును ఏర్పాటు చేశారు. కాగా, నెలలుగా నిర్మాణాలు చేపట్టిన ఘాట్ వద్ద పుష్కర స్నానాలు చేయకుండా నియంత్రించడానికి పెద్ద కారణాలే ఉంటాయని జిల్లా అధికారుల్లో చర్చ జరుగుతోంది. అయితే, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కాలంలో ఏటూరునాగారం అటవీప్రాంతం వారికి పెట్టనికోటగా ఉండేది.
ప్రస్తుతం విప్లవ పార్టీల ప్రాభల్యం తగ్గింది. పోలీసులదే పైచేయి కావడంతో ఈ ప్రాంతంలోని మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలను షెల్టర్జోన్గా ఎంచుకొని అక్కడ నుంచి కార్యకలపాలు సాగిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో... గోదావరి అవతలివైపు నుంచి వచ్చే భక్తులతో కలిసి బ్రిడ్జి మీదుగా మావోయిస్టులు వరంగల్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు వసమాచారం.
పుష్కర స్నానం కోసం వచ్చే వారితో మావోయిస్టులు జిల్లాలోకి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుందని... భక్తుల రూపంలో వారు వస్తే ఎలాంటి తనిఖీలు చేపట్టేందుకు వీలుం డదని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గోదావరిపై బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలిసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రహదారిలో అక్కడక్కడ కంకర పోసి వదిలివేయడం పోలీసుల వ్యూహమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
రోడ్డు ఇలా ఉంటే ప్రయాణానికి అనుకూలంగా లేదని చెప్పి రాకపోకలను అడ్డుకోవచ్చని పోలీసులు యోచించినట్లు తెలుస్తోంది. పుష్కరాల సమయంలో బందోబస్తు కోసం వేలాది మంది పోలీసులు విధి నిర్వహణల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సమయంలో బ్రిడ్జిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తే... భక్తుల రూపంలో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశాలు ఉందని పోలీసులకు సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితిని నివారించేందుకే బ్రిడ్జిని మూసివేసినట్లు కనిపిస్తోంది. వర్షాలు పడి ముల్లకట్ట వద్ద గోదావరిలో నీరు బాగా చేరి పుష్కరస్నానాలు జరిగినా బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించాలనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆమోదం పొందినట్లు తెలిసింది.
పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటు...
ముల్లకట్ట బ్రిడ్జి వద్ద రెండు రోజుల క్రితం అవుట్పోస్టును ఏర్పాటు చేశారు. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు 24 గంటలు ఈ బ్రిడ్జి వద్ద కాపలా కాస్తున్నారు. వీరికి అదనంగా పుష్కరఘాట్ సమీపంలో మరో క్యాంపును ఏర్పాటు చేశారు. పుష్కరాలు ముగిసే వరకు ఎలాంటి రాకపోకలను అనుమతించబోమని ఔట్పోస్టులో ఉన్న పోలీసులు చెబుతున్నారు. దీంతో పుష్కరాల కోసం వచ్చే ఖమ్మం జిల్లా వాసులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.
అన్నలొస్తారని...!
Published Thu, Jul 16 2015 8:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement