గవర్నర్‌ ముందు నాలుగు దారులు! | four options before TN Governor Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ ముందు నాలుగు దారులు!

Feb 14 2017 7:34 PM | Updated on Aug 21 2018 11:58 AM

గవర్నర్‌ ముందు నాలుగు దారులు! - Sakshi

గవర్నర్‌ ముందు నాలుగు దారులు!

నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి.

ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిసామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే...

1. ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్‌సెల్వం, పళనిసామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా విద్యాసాగర్‌ నిర్దేశించవచ్చు.

2. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసనసభను గవర్నర్‌ కోరవచ్చు.

3. ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్‌ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు.

4. ఇక నాలుగోది, చాలా కీలకమైన మార్గం.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్‌ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్‌ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది.

- 1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్‌ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్‌ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబికాపాల్‌, కళ్యాణ్‌సింగ్‌లలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్‌సింగ్‌ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు.
-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement