ఖతార్‌లో ఈస్టిండియా కంపెనీ! | east india company in qatar | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో ఈస్టిండియా కంపెనీ!

Jun 13 2014 1:04 AM | Updated on Sep 2 2017 8:42 AM

ఈస్టిండియా కంపెనీ.. భారతీయులకు చిరపరిచితమైన పేరు. 1600 సంవత్సరంలో ఇంగ్లండ్‌లో క్వీన్ ఎలిజబెత్ ఇచ్చిన రాయల్ చార్టర్ అనుమతితో ఏర్పడి.. వ్యాపార అవసరాల కోసం మన దేశంలో అడుగుపెట్టి.. దేశాన్నే కొల్లగొట్టిన నేపథ్యం ఆ కంపెనీది.

దుబాయి: ఈస్టిండియా కంపెనీ.. భారతీయులకు చిరపరిచితమైన పేరు. 1600 సంవత్సరంలో ఇంగ్లండ్‌లో క్వీన్ ఎలిజబెత్ ఇచ్చిన రాయల్ చార్టర్ అనుమతితో ఏర్పడి.. వ్యాపార అవసరాల కోసం మన దేశంలో అడుగుపెట్టి.. దేశాన్నే కొల్లగొట్టిన నేపథ్యం ఆ కంపెనీది. భారత్‌లో జన్మించిన సంజీవ్ మెహతా  2005లో ఆ కంపెనీని కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. లండన్‌లోని మేఫెయిర్‌లో ఆగస్ట్, 2010లో మళ్లీ మొదటి స్టోర్‌ను ఆ కంపెనీ ప్రారంభించింది. అనంతరం ఇంగ్లండ్‌లోనే మరో రెండు దుకాణాలను తెరిచింది. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో ఓ స్టోర్‌ను ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇప్పటికే కువైట్‌లో ఓ స్టోర్ ఉంది. త్వరలోనే సౌదీ అరేబియా, యూఏఈల్లో అమ్మకాలు ప్రారంభించనుంది.

 

ఇంతకీ ఈ కంపెనీ ఏం అమ్ముతుందంటారా? నాణ్యమైన టీ, కాఫీ పొడులు.. నోరూరించే ఖరీదైన చాక్లెట్లు, బిస్కట్లు.. ప్రత్యేకంగా తయారు చేయించిన స్వీట్లు, జామ్‌లు.. మొదలైనవి ఈ కంపెనీ అమ్మకపు శ్రేణి లో ఉన్నాయి. వాటితో పాటు, నిపుణులైన కళాకారులతో తయారు చేయించిన అత్యంత సుందరమైన, నాణ్యమైన పింగాణీ పాత్రలను కూడా అమ్ముతుంది. వాటిపై నిపుణులైన పెయింటర్లు వేసిన పెయింటింగ్‌లు కూడా ఉంటాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement