
తెలంగాణ ఏర్పాటు తొందరపాటు నిర్ణయం: దేవెగౌడ
తెలంగాణ ఏర్పాటు తొందరపాటు నిర్ణయమని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు తొందరపాటు నిర్ణయమని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయడమేంటినని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి నిర్ణయాలు అనేక పరిణామాలకు దారితీస్తాయని దేవెగౌడ హెచ్చరించారు.
ఈ ప్రక్రియలో అనేక ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఆర్టికల్-3 సవరణ అంశానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రంకోసం... పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్నే త్యాగం చేశారని దేవెగౌడ గుర్తు చేశారు.