
బ్యాంకులో పనిచేసి..!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాత కరెన్సీ మార్పిడి బృహత్ బాధ్యత బ్యాంకు సిబ్బందిపై పడింది.
మరోవైపు బ్యాంకు సిబ్బంది నిరంతరం పనిచేయడం వల్ల బ్యాంకుల సిబ్బంది కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఓ బ్యాంకు సిబ్బంది ప్రాణాలు విడిచాడు. భోపాల్లోని ఓ బ్యాంకులో ఆయన పనిచేస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.