మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్ | Ashok Leyland launches Stile at Rs. 7.49 lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్

Oct 8 2013 1:36 AM | Updated on Sep 1 2017 11:26 PM

మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్

మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్

హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) స్టైల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) స్టైల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.49 లక్షలు-రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). భారత్‌లో తమ తేలిక రకం వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంలో భాగంగా దీన్ని మార్కెట్లోకి తెచ్చామని ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్ వి. సుమంత్రన్ చెప్పారు. అశోక్ లేలాండ్-నిస్సాన్ మోటార్ కంపెనీ జాయింట్ వెంచర్... దోస్త్ ఎంపీవీ తరవాత దీన్ని అభివృద్ధి చేసింది. తేలిక రకం వాణిజ్య వాహనం ‘పార్ట్‌నర్’ను వచ్చే ఏడాది ఈ కంపెనీ మార్కెట్లోకి తేబోతోంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7-8 సీట్ల రవాణా వాహనంగా, ట్యాక్సీ సర్వీస్‌కు, అంబులెన్స్ సర్వీస్‌కు, హోటల్ షటిల్స్‌కు ఈ స్టైల్ కారు ఉపయోగపడుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
 
 త్వరలో సీఎన్‌జీ వేరియంట్
 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 5 స్పీడ్ ట్రాన్సిమిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, వంటి ప్రత్యేకతలున్న ఈ స్లైల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 18 సెకన్లలోనే అందుకుంటుందని, 19.5 కిమీ నుంచి 22.5 కిమీ. వరకూ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. త్వరలో సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement