భూబిల్లుపై పార్లమెంటశివసేనరీ కమిటీ భేటీలో విపక్ష సభ్యుల డిమాండ్
వ్యతిరేకించిన బీజేపీ, శివసేన
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుకు సంబంధించి ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సోమవారం కమిటీ సమావేశం మొదలుకాగానే టీఎంసీ సభ్యులు మాట్లాడుతూ భూ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిపోయినందున బిల్లును వెనక్కు తీసుకోవాలన్నారు. అందుకు బీజేపీ, శివసేన సభ్యులు అభ్యంతరం తెలిపారు. బిల్లుపై నివేదిక సమర్పించడం వరకే కమిటీ బాధ్యత అని, అంతవరకే పరిమితం కావాలన్నారు. అందుకు కల్యాణ్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్) స్పందిస్తూ.. ‘ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు ప్రధానిని కమిటీ ముందు సాక్షిగా హాజరు పర్చాలి’’ అని డిమాండ్ చేశారు. ఆయనతో కాంగ్రెస్ సభ్యులు కూడా గొంతుకలిపారు. దాన్ని బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సమావేశం వాయిదా పడింది.
మళ్లీ గడువు కోరితే..?
ఈ నెల 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. కమిటీ ఒకవేళ మరోసారి గడువు పెంచాలని కోరితే ఈ సమావేశాల్లో భూసేకరణ బిల్లు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అహ్లూవాలియా యోచిస్తున్నారు. ‘ఎందుకు ఈ సాగదీత? ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంటే మంచిది’ అని తృణమూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, శీతాకాల సమావేశాల్లో సభ్యులు మర్యాదగా నడుచుకోవాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపీలందరికీ లేఖలు రాశారు. ఈ సమావేశాల మొదటిరోజైన నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోనున్నారు.
ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలి
Published Tue, Nov 24 2015 2:02 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
తప్పక చదవండి
- భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement