భద్రతా కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి! | anti militancy operation in Kashmir | Sakshi
Sakshi News home page

భద్రతా కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి!

Mar 28 2017 7:28 PM | Updated on Apr 4 2019 5:53 PM

మంగళవారం భద్రతాదళాలు చేపట్టిన మిలిటెంట్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో ముగ్గురు పౌరులు, ఒక మిలిటెంట్‌ మృతిచెందారు.

జమ్మూకశ్మీర్‌లోని బుడ్‌గామ్‌ జిల్లాలో మంగళవారం భద్రతాదళాలు చేపట్టిన మిలిటెంట్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో ముగ్గురు పౌరులు, ఒక మిలిటెంట్‌ మృతిచెందారు. ఒక జవానుకు గాయాలయ్యాయి. పలువురు పౌరులు కూడా గాయపడ్డారు. మిలిటెంట్‌ను తప్పించడానికి స్థానికులు ప్రయత్నించారని, పెద్ద సంఖ్యలో గుమిగూడిన స్థానికులు ఆందోళనకు దిగి .. భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో.. భద్రతా దళాలు కాల్పులు జరిపాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్‌ ప్రాణాలు విడిచాడని, అతని వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. భద్రతా దళాల ఆపరేషన్‌లో జహిద్‌ దార్‌, సకిబ్‌ అహ్మద్‌, ఇష్ఫాక్‌ అహ్మద్‌ వనీ అనే యువకులు మృతిచెందారు. మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు బుడ్‌గామ్‌ జిల్లాలోని దుర్భాఘ్‌ ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement