పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్ | All four Trinamool MLAs join Congress in Manipur | Sakshi
Sakshi News home page

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

Sep 18 2016 5:55 PM | Updated on Sep 4 2017 2:01 PM

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఇంఫాల్: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం మణిపూర్ టీఎంసీ చీఫ్ శ్యాంకుమార్ సహా ఆ రాష్ట్రంలో పార్టీకి చెందిన మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఎంసీ జాతీయ నేతలు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నరని, పార్టీని వీడాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు శ్యాంకుమార్ చెప్పారు. మణిపూర్ సమస్యలను తృణమాల్ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోవడం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని  కోరితే నిరాకరించారని ఆరోపించారు. 2012 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా గతేడాది మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేను సభకు అనుమతించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యుంఖమ్ ఎరబొట్ ఇటీవల బీజేపీలో చేరారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement