వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఏసీబీ నోటీసు | ACB summons to vem narender reddy son | Sakshi
Sakshi News home page

వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఏసీబీ నోటీసు

Jul 14 2015 7:54 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరొకరికి నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరొకరికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్కు నోటీసులు జారీ చేశారు.

బుధవారం ఉదయం 10 గంటలలోగా విచారణకు హాజరు కావాలని కృష్ణను ఆదేశించారు. ఈ కేసులో ఫోన్ కాల్ లిస్టులో కృష్ణ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో కేసు విచారణలో మరిన్ని వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు కృష్ణను విచారించనున్నారు. ఏసీబీ అధికారులు కృష్ణను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏసీబీ అధికారులు ఇదివరకే వేం నరేందర్ రెడ్డిని విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement