ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరో ఐదుగురిని ప్రశ్నించారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరో ఐదుగురిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలతో పాటు తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్లకు చెందిన పుల్లారావు, మనోజ్, సుధీర్లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
మంగళవారం వీరు ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బు వ్యవహారం, ఇతర కీలక అంశాల గురించి వీరిని ప్రశ్నించారు. రేపు కూడా ఏసీబీ అధికారులు వీరిని విచారించనున్నారు.