అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా | workers dharna at amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా

Aug 13 2015 1:40 PM | Updated on Sep 3 2017 7:23 AM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు.

కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో వేతనాలు చెల్లించాలని, నిబంధనల ప్రకారం జీతాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపి, యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement