మట్టిపెళ్లలు కూలి వ్యక్తి మృతి | Worker killed in landslides | Sakshi
Sakshi News home page

మట్టిపెళ్లలు కూలి వ్యక్తి మృతి

Oct 1 2015 3:04 PM | Updated on Sep 3 2017 10:18 AM

బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు కూలి వలస కూలీ మృతిచెందగా.. మరో కూలీకి తీవ్రగాయాలయ్యాయి.

బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు కూలి వలస కూలీ మృతిచెందగా.. మరో కూలీకి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి తీయిస్తున్న క్రమంలో మట్టి పెడ్డలు కూలడంతో బావిలో పనిచేస్తున్న వలస కూలీ మల్లయ్య(40) మృతిచెందాడు. అదే సమయంలో బావిలో పనిచేస్తున్న మరో కూలీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement