వేగంగా వెళ్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి చనిపోగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి చనిపోగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని కోనేరు బజార్కు చెందిన మల్లవరపు పుల్లయ్య... భార్య శాంతమ్మ, మరదలు మరియమ్మ(28), మరదలి కొడుకు విమల్(5)లతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి అశ్వారావుపేట వస్తున్న కారు వీరి బైక్ను ఢీ కొట్టింది. దీంతో మరియమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ప్రమాదంలో కింద పడిన బాలుడు విమల్ తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బాలుడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. కాగా పుల్లయ్య, శాంతమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.