ఇటుకబట్టీలో మహిళ మృతి | woman died in brick kiln | Sakshi
Sakshi News home page

ఇటుకబట్టీలో మహిళ మృతి

Mar 25 2015 5:25 PM | Updated on Apr 3 2019 7:53 PM

బతుకు తెరువు కోసం ఇటుకబట్టీలో చేరితే ఆ బట్టీనే ఆమె ప్రాణం తీసింది

కందుకూరు : బతుకు తెరువు కోసం ఇటుకబట్టీలో చేరితే ఆ బట్టీనే ఆమె ప్రాణం తీసింది. ఉపాధి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన లలిత(60) అనే మహిళ గత కొంత కాలంగా ఇటుకబట్టీలో పనిచేస్తుంది. రోజూ మాదిరే ఆమె బుధవారం బట్టీలో పనిచేసుకుంటుండగా రివర్స్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement