ఆంధ్రా సెటిలర్స్కు అండగా ఉంటాం: ఐలయ్య
హైదరాబాద్: ఆంధ్రా సెటిలర్స్కు అండగా ఉంటా మని, టీఆర్ఎస్ భయపెడితే వారు భయపడాల్సిన అవసరం లేదని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లపై టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తోందని, కేసీఆర్, కేటీఆర్ వాడే భాష సరైంది కాదన్నారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.