నేత కార్మికురాలు ఆత్మహత్య | Weavers committed suicide | Sakshi
Sakshi News home page

నేత కార్మికురాలు ఆత్మహత్య

Sep 28 2015 9:38 PM | Updated on Mar 28 2019 5:39 PM

కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రానికి చెందిన సబ్బని మధునమ్మ(49) అప్పులబాధతో సోమవారం ఆత్మహత్య చేసుకుంది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రానికి చెందిన సబ్బని మధునమ్మ(49) అప్పులబాధతో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మధునమ్మ- రామచంద్రం దంపతులు వీణవంక చేనేత సంఘంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆప్కో నూలు పోగులు ఇవ్వడం లేదు. దీంతో పని దొరక్క ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. కుటుంబం గడిచేందుకు అప్పులు తేవాల్సి వచ్చింది. దీనికి తోడు ఏడాది క్రితం అప్పు చేసి కూతురు వివాహం జరిపించారు. మొత్తం అప్పులు రూ.6 లక్షలకు చేరడంతో అప్పులెలా తీర్చేదని మనోవేదన చెందిన మధునమ్మ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement