ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు | water proble: womens protest with empty pots | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

Mar 20 2016 11:12 AM | Updated on Sep 3 2017 8:12 PM

మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.

సుల్తానాబాద్(కరీంనగర్): మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో గత రెండు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో.. ఆగ్రహించిన మహిళలు ఆదివారం ఉదయం ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement