రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ మృతి | vro died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ మృతి

Mar 31 2015 5:13 PM | Updated on Aug 30 2018 3:56 PM

విధినిర్వహణలో ఉన్న వీఆర్‌ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దేవపూర్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది.

ఇంద్రవెల్లి : విధినిర్వహణలో ఉన్న వీఆర్‌ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దేవపూర్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న గణేష్(27) తన బావ మరిది విష్ణు ప్రసాద్(22)తో కలిసి మంగళవారం ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు బైక్ పై బయలుదేరారు. దేవపూర్ సమీపంలో బైక్ వెనుక నుంచి వేగంగా వచ్చిన జీప్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంటలో పడింది. బైక్ పై ఉన్న గణేష్, విష్ణు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement