ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు | Villagers opposed to the private school bus | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

Jun 20 2016 11:49 PM | Updated on Sep 4 2017 2:57 AM

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్, ఎంపీటీ సభ్యురాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి తమ గ్రామం నుంచి ...

నర్సంపేట రూరల్: మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్, ఎంపీటీ సభ్యురాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి తమ గ్రామం నుంచి నర్సంపేటకు విద్యార్థులను తీసుకెళుతున్న ప్రైవేట్ పాఠశాలల బస్సును సోమవారం నిలిపివేశారు. విద్యార్థులను దింపి, వారందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మండ మహేందర్, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి లావణ్యరాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని, చిన్నారులను ఈ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజ లు సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ‘చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించమని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement