వినాయకచవితి ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక మంటపం వద్ద విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృత్యువు పాలయ్యారు.
సిరిసిల్ల (కరీంనగర్) : వినాయకచవితి ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక మంటపం వద్ద విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృత్యువు పాలయ్యారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కొందరు యువకులు వినాయక ఉత్సవాల సందర్భంగా మంటపం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం లైన్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై నిమ్మల నరేష్, ఎం.పరశురాములు అనే యువకులు చనిపోయారు. మృతులు బావాబామ్మర్దులుగా సమాచారం.