సిద్దిపేట రూరల్ : డబ్బును దాచేందుకు ఆటోలో బ్యాంక్కు వెళ్తున్న ఓ వృద్ధురాలిని మాటలతో మస్కా కొట్టిన ఇద్దరు మహిళలు నగదును దోపీడీ చేసిన సంఘటన శుక్రవారం సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బక్రిచెప్యాల గ్రామానికి చెందిన మల్లోజి విజయలక్ష్మి గ్రామానికి చెందిన ఓ ఆటోలో తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలను ఓ చేతి సంచిలో పెట్టుకుని సిద్దిపేటలో ఉంటున్న తన కుమారుడి వద్దకు బయలుదేరింది.
ఈ క్రమంలో రాజీవ్ రహదారి పొన్నాల స్టేజీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పురుషులు ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణిస్తున్న విజయలక్ష్మిని మాటల్లో పెట్టి ఆమెకు తెలియకుండానే చేతిలో ఉన్న సంచిని కత్తిరించి అందులో గల రూ. 2.50 లక్షలను అనుమానం రాకుండా నొక్కేశారు. పాత బస్టాండ్ వద్ద అందరూ ఆటో నుంచి దిగారు. అప్పటికే ఆటోలో వస్తున్న విజయలక్ష్మి కోసం తన కుమారుడు అక్కడ సిద్ధంగా ఉండడంతో ఆమెను తీసుకుని డబ్బులను జమ చేసేందుకు పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్కు తీసుకెళ్లాడు. డబ్బులను జమ చేసే ఓచర్లో పేర్లు రాసి నోట్లు లెక్కించడానికి సంచిని తెరిచి చూడగా అందులోని డబ్బు మాయమైంది.
సంచికి కత్తిరించిన ఆనవాళ్లు కనిపించడంతో బాధితురాలు డబ్బులు దోపిడీకి గురయ్యాయని లబోదిబోమంది. వెంటనే కుమారుడితో కలిసి స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని చోరీకి సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వెంటనే పట్టణంలో పోలీసులను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సురేందర్రెడ్డి తెలిపారు.
మాటల్లో గారడీ.. ప్రయాణంలో దోపీడీ
Published Fri, Dec 26 2014 10:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement