అక్కాచెల్లెళ్లు చనిపోయారు | two sisters died in godavari river ofter went to bath | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లు చనిపోయారు

Apr 16 2015 5:33 PM | Updated on Sep 28 2018 3:39 PM

పుణ్య స్నానానికి వెళ్లి అక్కాచెల్లెలు ప్రమాదవశాత్తు చనిపోయిన విషాద ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.

కరీంనగర్: పుణ్య స్నానానికి వెళ్లి అక్కాచెల్లెలు ప్రమాదవశాత్తు చనిపోయిన విషాద ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన కట్ల లత, రాజేందర్ దంపతుల కుమార్తెలు శ్రావణి, పవిత్రలు అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు గురువారం ధర్మపురికి వెళ్లారు. అక్కడి నుంచి గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లి అనుకోని విధంగా మృత్యువాత పడ్డారు. దీంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement