జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని సదగోడులో శనివారం రాత్రి పిడుగు పాటుకు మొగిలి లక్ష్మయ్యకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి.
మహబూబ్ నగర్: జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని సదగోడులో శనివారం రాత్రి పిడుగు పాటుకు మొగిలి లక్ష్మయ్యకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. రోజు మాదిరిగానే సాయంత్రం పొలంలో కట్టేసి ఉంచిన ఎద్దులు ఉదయం వెళ్లి చూసేసరికి చనిపోయి పడివున్నాయని బాధిత రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. తహశీల్దార్ సైదులు సూచనమేరకు వీఆర్వో సుదర్శనాచారీ ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు.
చనిపోయిన ఎద్దుల విలువ రూ. 80 వేల వరకు ఉంటుందని వీఆర్వో తెలిపారు.