పిడుగుపాటుకు కాడెద్దులు బలి | two oxes killed by Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు కాడెద్దులు బలి

Apr 12 2015 7:38 PM | Updated on Aug 25 2018 5:33 PM

జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని సదగోడులో శనివారం రాత్రి పిడుగు పాటుకు మొగిలి లక్ష్మయ్యకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి.

మహబూబ్ నగర్: జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని సదగోడులో శనివారం రాత్రి పిడుగు పాటుకు మొగిలి లక్ష్మయ్యకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. రోజు మాదిరిగానే సాయంత్రం పొలంలో కట్టేసి ఉంచిన ఎద్దులు ఉదయం వెళ్లి చూసేసరికి చనిపోయి పడివున్నాయని బాధిత రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. తహశీల్దార్ సైదులు సూచనమేరకు వీఆర్వో సుదర్శనాచారీ ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు.

చనిపోయిన ఎద్దుల విలువ రూ. 80 వేల వరకు ఉంటుందని వీఆర్వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement