హయత్నగర్ మండలం వద్ద అంబర్పేట్లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: హయత్నగర్ మండలం వద్ద అంబర్పేట్లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్, క్లీనర్ మృతిచెందగా, మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రియాంక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 10v 2255) ఎదురుగా వస్తున్న ఢీసీఎంను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.