
మునిపల్లి (అందోల్): ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. హిమ్రాన్ పటేల్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సదాశివపేటలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ పరామర్శించారు. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గొడవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.