
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి శివారులోని జాతీయ రహదారి–65 ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి (45) దుర్మరణం పాలయ్యాడు.
నార్కట్పల్లి (నకిరేకల్): నల్లగొండ జిల్లా నార్కట్పల్లి శివారులోని జాతీయ రహదారి–65 ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి (45) దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు, చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ దుబ్బాక మమత భర్త సతీశ్రెడ్డి వ్యాపార నిమిత్తం విశాఖపట్నం వెళ్లి తిరిగి చిట్యాలకు తన డస్టర్ కారులో వస్తున్నాడు. కాగా, నార్కట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి రాగానే డీజిల్ లేక రోడ్డు పక్కన ఓ లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో ఆ లారీని వెనుక నుంచి సతీష్రెడ్డి కారు ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.