రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం | TRS leader Dubbaka Sathish Reddy dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం

Jul 29 2017 12:26 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారి–65 ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా నాయకుడు సతీశ్‌రెడ్డి (45) దుర్మరణం పాలయ్యాడు.

నార్కట్‌పల్లి (నకిరేకల్‌): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారి–65 ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా నాయకుడు సతీశ్‌రెడ్డి (45) దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు, చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ దుబ్బాక మమత భర్త సతీశ్‌రెడ్డి వ్యాపార నిమిత్తం విశాఖపట్నం వెళ్లి తిరిగి చిట్యాలకు తన డస్టర్‌ కారులో వస్తున్నాడు. కాగా, నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపైకి రాగానే డీజిల్‌ లేక రోడ్డు పక్కన ఓ లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో ఆ లారీని వెనుక నుంచి సతీష్‌రెడ్డి కారు ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement