గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి | Tragedy in Ganesh immersion | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి

Sep 27 2018 3:30 AM | Updated on Sep 27 2018 3:31 AM

Tragedy in Ganesh immersion - Sakshi

ఇటిక్యాల (అలంపూర్‌): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా నదిలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా బుధవారం అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్‌లోని మస్తాన్‌నగర్‌కు చెందిన 22 మంది యువకులు గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బుధవారం ఉదయం బీచుపల్లికి చేరుకున్నారు.విగ్రహాన్ని దించుతున్నప్పుడు హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌ ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సాయిరాం(18), రాజ్‌కుమార్‌(18) విగ్రహం అడుగు భాగంలో చిక్కుకుపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందారు. కాగా, బీచుపల్లి వద్ద రెండు రోజుల క్రితమే గణేశ్‌ నిమజ్జనోత్సవాలు ముగియడంతో అధికారులెవరూ అక్కడ లేరు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక గజ ఈతగాళ్లు యువకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement