నేడు ‘ప్రధానమంత్రి జన ధన’ ప్రారంభం | Today, "the Prime Minister over the money 'to start | Sakshi
Sakshi News home page

నేడు ‘ప్రధానమంత్రి జన ధన’ ప్రారంభం

Aug 28 2014 2:23 AM | Updated on Aug 20 2018 9:16 PM

నేడు ‘ప్రధానమంత్రి జన ధన’ ప్రారంభం - Sakshi

నేడు ‘ప్రధానమంత్రి జన ధన’ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన ధన యోజన పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) శాఖ ఆధ్వర్యంలో...

సుబేదారి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన ధన యోజన పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) శాఖ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలే జీ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.

ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎస్‌బీహెచ్ వరంగల్ జోనల్ ఆఫీసర్ వీఏ మాథ్యూకుట్టి, జనరల్ మేనేజర్ ఎస్.మానికందన్, జనరల్‌మేనేజర్ వి.శ్రీహరి పాల్గొంటారు. ఈ సందర్భంగా అతిథులు బ్యాంక్ అకౌంటింగ్ ఓపెనింగ్ కిట్స్‌ను పంపిణీ చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement