సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం ముదురుతోంది. కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కొండా, కడియం.. గతంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది. ఈ నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.
సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్కు కొండా సురేఖ లేఖ రాసిన రాశారు.


