- సంగారెడ్డిలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ముట్టడి
- కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి
- కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సంగారెడ్డి క్రైం : రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెలు, ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ధ్వజమెత్తారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కార్మికులు స్థానిక ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం మాట తప్పారన్నారు.
గత నెల 15 నుంచి కార్మికుల సమస్యలపై కార్మిక పోరుబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశామన్నారు. సర్వేలో ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని తేలిందన్నారు. కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితరులకు వేతనాలు పెంచినప్పటికీ, రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న అసంఘటిత కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు.
కార్యక్రమంలోసీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కె.రాజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ నాయకులు సర్దార్, ప్రవీణ్, నాగేశ్వర్రావు, నర్సమ్మ,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో దయానంద్కు అందజేశారు.
కదం తొక్కిన కార్మికులు..
Published Mon, Jul 6 2015 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement