పిడుగుపాటుకు ముగ్గురు మహిళల మృతి | thunderbolt kills three womens in mahabubnagar district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురు మహిళల మృతి

Oct 3 2015 4:39 PM | Updated on Jul 29 2019 5:43 PM

పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు.

మహబూబ్ నగర్: పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఔసులోను పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు మహిళలు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వారిపై పిడుగు పడింది.

దీంతో భారతమ్మ, మణెమ్మ, శాంతమ్మ అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement