సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉద్దేశించిన ముగ్గురు మంత్రుల కమిటీ భేటీ బుధవారం సచివాలయంలో జరగనుంది. ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సభ్యులుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఏయే అంశాల ప్రాతిపదికన విద్యార్థులకు ఫీజులు, బకాయిల చెల్లింపు చేయాలి, ఇందుకు ఏయే మార్గదర్శకాలను పెట్టాలి అనే అంశంపై త్రిసభ్య కమిటీ సచివాలయంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం కానుంది. విద్యార్థుల కనీస విద్యార్హతలు, స్థానికత నిర్ధారణ, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపునకు కొత్తగా ఏవైనా మార్గదర్శకాలు చేర్చాలా అన్న దానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యా, సంక్షేమశాఖ అధికారులతో చర్చల సందర్భంగా వచ్చే సూచనలు, సలహాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి కేసీఆర్కు త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు సమర్పించనుంది. నెల రోజుల్లో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు సమాచారం.
సంక్షేమ మంత్రే లేకపోతే ఎలా...!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రుల్లో ఎవరూ సభ్యులుగా లేకపోవడం చర్చనీయాంశమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా సంక్షేమ శాఖకు సంబంధించినది కాగా ఈ శాఖ మంత్రులకే ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదంటున్నారు. పథకంతో ఏమాత్రం సంబంధం లేని విద్యాశాఖ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో విద్యుత్, వైద్యశాఖల మంత్రులను సభ్యులుగా వేస్తే దాని వల్ల ఒరిగేదేమీ ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి, సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల గురించి వీరికి ఏ మేరకు అవగాహన ఉంటుంది, ఆయా సమస్యలు,అంశాలపై తగిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోగలుగుతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
నేడు ‘ఫీజు’పై త్రిసభ్య కమిటీ భేటీ
Published Wed, Feb 4 2015 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement