యాదాద్రిలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు | three houses thefted in yadari bhuvanagiri district | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

Jan 25 2017 11:27 AM | Updated on Aug 28 2018 7:32 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

రాజుపేట : యాదాద్రి భువనగిరి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాజుపేట మండలం కాల్వపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. రూ. 85 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement