వ్యవసాయం కలిసి రాక చెల్లి పెళ్లి చేసే మార్గం తోచక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వ్యవసాయం కలిసి రాక చెల్లి పెళ్లి చేసే మార్గం తోచక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎలెగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జాదవ్ ప్రదీప్ (25)కు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో సోదరులు వ్యవసాయం చూసుకుంటున్నారు.
అయితే, పంటలు సరిగా పండక పోవడంతో గతేడాది చెల్లిపెళ్లిని వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండటంతో చెల్లిపెళ్లి ఎలా చేయాలో వారికి పాలుపోలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రదీప్ గురువారం రాత్రి పొలం దగ్గర పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం గుర్తించారు.