ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి


తల్లాడ(ఖమ్మం): ట్రాక్టర్ లో డిజిల్ అయిపోవడంతో డ్రైవర్ ట్రాక్టర్ ను రోడ్డు పక్కన నిలిపాడు. నిల్చొని ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

 

ఈ సంఘటన  జిల్లాలోని తల్లాడ మండలం లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మిర్చీలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ డిజిల్‌ అయిపోవడంతో.. ఇంధనం నింపుతుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవరం గ్రామానికి చెందిన చెరుకూరి రామారావు అనే రైతు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top