ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి | The person killed in the collision, the lorry tractor .. | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

Apr 5 2017 10:07 AM | Updated on Apr 3 2019 8:07 PM

ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తల్లాడ(ఖమ్మం): ట్రాక్టర్ లో డిజిల్ అయిపోవడంతో డ్రైవర్ ట్రాక్టర్ ను రోడ్డు పక్కన నిలిపాడు. నిల్చొని ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ సంఘటన  జిల్లాలోని తల్లాడ మండలం లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మిర్చీలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ డిజిల్‌ అయిపోవడంతో.. ఇంధనం నింపుతుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవరం గ్రామానికి చెందిన చెరుకూరి రామారావు అనే రైతు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement