డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి | The baby died in the womb | Sakshi
Sakshi News home page

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి

Jun 23 2017 7:36 PM | Updated on Sep 28 2018 3:41 PM

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి - Sakshi

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది.

కరీంనగర్: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. వైద్యులు సరిగా పట్టించుకోక పోవడంతో శిశువు గర్భంలోనే మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం శ్రీరామ కాలనీకి చెందిన అంజలి అనే గర్భిణీని నిన్న  రాత్రి బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

నొప్పులు రాకపోవడంతో వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరువాత ఉదయం 9 గంటల వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు  11 గంటలకు అంజలి చనిపోయిన బిడ్డను ప్రసవించింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ గర్భంలోనే చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement