తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో రస స్ఫూర్తికి కొదువ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సారస్వత పరిషత్ భవనంలో ఆదివారం శతావధానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని అవధాని రామశర్మను సన్మానించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా ప్రియులకు మేలు చేసేలా మహా సభల ముగింపులో మంచి ప్రకటన చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.