తెలంగాణ టీడీపీ నేతల బస్సు యాత్ర శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టారు.
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల బస్సు యాత్ర శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ మాట్లాడుతూ వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదన్నారు. రైతులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.