రైతులకు అండగా ఉండేందుకే బస్సు యాత్ర | Telangana TDP leaders launch bus yatra | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా ఉండేందుకే బస్సు యాత్ర

Oct 10 2014 9:42 AM | Updated on Jul 11 2019 7:38 PM

తెలంగాణ టీడీపీ నేతల బస్సు యాత్ర శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టారు.

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల బస్సు యాత్ర శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ మాట్లాడుతూ వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదన్నారు. రైతులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement