రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసుల వైపు చూస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసుల వైపు చూస్తున్నారు. యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ అధికారులుగా ఎంపికైన వారు తమ సర్వీసులో కచ్చితంగా రెండేళ్లపాటు సెంట్రల్ డిప్యుటేషన్లో పని చేయాల్సి ఉంటుంది. ఎస్పీ హోదా నుంచి డీజీపీ హోదా వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న పోస్టుల్లో పనిచేసి తిరిగి సొంత క్యాడర్కు వస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులు ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో పని చేయలేదు. కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా తమ పరిధిలో పని చేసేందుకు ఆసక్తి కనబరచిన అధికారుల జాబితాతో ఆఫర్ లిస్ట్ విడుదల చేస్తుంది.
ఇలా ఈ నెలలో విడుదల చేసిన జాబితాలో అదనపు డీజీపీ, పౌర సరఫరాల కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్, శిక్షణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఐజీ చారుసిన్హా పేర్లు ఉన్నాయి. సెంట్రల్ డిప్యుటేషన్లో పని చేయకపోతే రాష్ట్రంలోని కీలక పోస్టుల్లో పని చేయాల్సిన సందర్భంలో ఎంపానల్మెంట్ జాబితాలోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆఫర్ లిస్ట్లో ఉన్న అధికారులకు వేకెన్సీని బట్టి కేంద్ర హోంశాఖ అవకాశం కల్పిస్తుంది. మరో ఇద్దరు ఐజీలు రాష్ట్రంలో తమకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలపై గీత కార్మికుల సంఘం హర్షం
సాక్షి, హైదరాబాద్: కల్లు పేద ప్రజల పానీయమని, గత పాలకులు లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లును కల్తీపేరుతో బద్నామ్ చేశారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొనడాన్ని తెలంగాణ కల్లు గీత కార్మికుల సంఘం ఓ ప్రకటనలో స్వాగతించింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న లైసెన్స్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ విజ్ఞప్తిచేశారు.