ఉద్యోగులకు పెంచిన 43 శాతం ఫిట్మెంట్ బకాయిలు బాండ్ల రూపంలో ఇస్తామన్నది అవాస్తవమని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్ : ఉద్యోగులకు పెంచిన 43 శాతం ఫిట్మెంట్ బకాయిలు బాండ్ల రూపంలో ఇస్తామన్నది అవాస్తవమని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును జీర్నించుకోలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈటెల స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని ఆయన అన్నారు.