చదువు ఇష్టం లేక..

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడో తరగతి చదువుతున్న వేణు(12) దసరా సెలవులకు ఇంటికి వెళ్లి బుధవారం హాస్టల్‌కి తిరిగి వచ్చాడు. ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ఇది గుర్తించిన పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. మేళ్లచెరువు మండలం వేపల మాదవరం గ్రామానికి చెందిన వేణు చదువు ఇష్టం లేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top