తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణానికి 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు.
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణానికి 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన స్వయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వీవీ.నాయుడు, జిల్లా రిజిస్ట్రార్ కె.రమణారావు, సబ్ రిజిస్ట్రార్ డి.అశోక్ మంత్రితో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రూ.24,024 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. సిరిసిల్లలో కేటీఆర్ తొలిసారి 2009లో పోటీ చేసినపుడు స్థానికంగానే నివాసం ఉంటానని హామీ ఇచ్చారు. కానీ 2014 ఎన్నికల తర్వాత తన హామీని నెరవేర్చుకుంటున్నారు.